నెల్లికుదురు, ఫిబ్రవరి 23 : యువతిపై సామూహిక లైంగిక దాడి చేయడంతో బాధితురా లు ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మహ బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన యువతి(23) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ప్రస్తుతం పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్నది. ఈ క్రమం లో ఈ నెల 17న రాత్రి వరకూ యువతి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ విషయం చెప్పకుండా శుక్రవారం ఉద యం పురుగుల మందు తాగింది. గమనించిన కు టుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్ప త్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూ సైడ్ నోట్ రాసి 22న సాయంత్రం మృతి చెందిం ది. గ్రామానికి చెందిన చెందిన యాట సాగర్, నజీ మ్, సద్దాం హుస్సేన్, కోయిలకొండ్ల జగదీశ్ ఎవ రికీ చెప్పుకోలేనంతగా బాధ పెట్టారని సూసైడ్ నో ట్లో పేర్కొంది. ఆ నలుగురు వ్యక్తులను పోలీసు లు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు స మాచారం. మృతురాలి తమ్ముడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు తొర్రూరు సీఐ కరుణాకర్రావు తెలిపారు. ఆ యన వెంట నెల్లికుదురు ఎస్సై జితేందర్ ఉన్నారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితు లకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, మృతు రాలి కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలోని యువతి మృతదేహాన్ని మంత్రితో కలిసి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి సందర్శించారు. ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.