హనుమకొండ, ఏప్రిల్ 14 : హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్కుమార్ ఆదివారం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఎర్రవెల్లి ఫాం హౌస్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.