తాడ్వాయి, ఫిబ్రవరి11: ప్రతి రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర అనంతరం వచ్చే ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సా రక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండెమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పూజారులు ఆయా గ్రామాల్లో డోలివాయిద్యాల నడుమ గ్రామదేవత, బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు చేసి, అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మా మిడి ఆకులతో పాటు కోడి పిల్లతో తోరణాలు కడతా రు.
అనంతరం పూజారులతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు సమ్మక్క-సారక్కల పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్ల మి నీ జాతర ముగిసే వరకు సమ్మక్క, సారక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, కాక సార య్య అత్యం త నియమనిష్టలతో తల్లులకు పూజలు నిర్వహిస్తారు. బుధవారం రాత్రంతా గద్దెల వద్ద జాగారం చేసి అనంతరం ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మినీ జాతర ప్రారంభమవుతుంది. తల్లులను గద్దెల మీదకు తీసుకురావడం మినహా మహాజాతర సందర్భంగా అమ్మవార్లకు జరిగిన పూజా కార్యక్రమా లు యథావిధిగా కొనసాగుతాయి. బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం అమ్మవార్ల పూజా సామగ్రిని శుద్ధి చేసిన అనంతరం గుడిలో భద్రపరచడంతో మినీ జాతర ముగుస్తుంది.
ములుగు రూరల్: మినీ మేడారం జాతరకు వివిధ మార్గాల నుంచి వచ్చే భక్తులకు రోడ్డు మార్గాలతో పాటు రూట్లను కేటాయించినట్లు ఎస్పీ పీ శబరీశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ నుంచి వచ్చే భక్తుల కోసం ఒక రూట్, భూపాలపల్లి, కరీంనగర్ మీదుగా రెండో రూట్, ఏటూరునాగారం, కొత్తగూడెం మీదుగా మూడో రూట్, ఆర్టీసీ బస్సుల ద్వారా పస్రా, తాడ్వాయి మీదుగా వచ్చే భక్తుల కోసం 4వ రూట్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీవీఐపీ భక్తుల కోసం శ్రీరాంసాగర్ చెరువు పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
ఈనెల 12, 13, 14వ తేదీల్లో సమ్మక-సారలమ్మ మినీ మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో బస్సుల సౌకర్యార్థం ఆర్టీసీ వరంగల్ రీజియన్ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం డీ విజయభాను తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఉదయం 6 గంటల నుంచి మేడారానికి బస్సులు నడుపుతున్నట్లు, ప్రత్యేక బస్సుల ఆపరేషన్ నిర్వహణకు హనుమకొండ, మేడారం బస్టాండ్లో ఆర్టీసీ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అన్ని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, ఆడపిల్లలకు మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని, ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. జాతర బస్సుల చార్జీలు ఎక్స్ప్రెస్ రూ.200(పెద్దలు), రూ.110( పిల్లలు), ఈ-ఎక్స్ప్రెస్ రూ.210(పెద్దలు), రూ. 120( పిల్లలు) ఉంటుందని ఆర్ఎం తెలిపారు.