మహబూబాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): మహ బూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలలో తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. మంగళవా రం హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్లో ప్రారం భించనున్నారు. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తుది విద్యా సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రా రంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాది సెప్టెంబ ర్లో జిల్లాకు మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో కేటాయించిన 33 ఎకరాల విశాల స్థలాన్ని కళాశాల నిర్మా ణం కోసం కేటాయించారు. ఇందులోనే మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల హాస్టల్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 560 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యింది.
గత నెలలో నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి లభించింది. దీంతో తరగతుల నిర్వహణ కోసం జిల్లా యంత్రాగం చకాచకా ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల చివరి వారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించగా ఎంబీబీఎస్ తొలి విద్యా సంవత్సరం విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీటి కి త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్లో సీఎం కేసీఆర్ తరగతులను ప్రారంభించ నున్నారు. మానుకోట జిల్లా గిరిజన ప్రజల వైద్య కల నెరవేరుతుండడం తో జిలావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ త్వర లో నే జిల్లాలో పర్యటించి నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సమీ కృత భవనం, మెడికల్ కళాశాల భవనం, టీఆర్ఎస్ పార్టీ కార్యా లయం, జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు. మంగళ వారం హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళా శాల తరగతులను ముఖ్యమంత్రి ప్రా రంభి స్తారని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు.