మహబూబాబాద్ : విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మపురం జీ కే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ మహేష్ (30) బానోత్ సుధాకర్ (35) అనే రైతులు వ్యవసాయ బోరు మోటర్ కాలిపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ను బంద్ చేయడానికి వెళ్లారు.
కాగా, ట్రాన్స్ ఫార్మర్ చుట్టుపక్కల ఐదు మీటర్ల దూరం వరకు కరెంట్ సరఫరా అవడంతో విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం తొర్రూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. విద్యుత్ అధికారులకు పలుమార్లు రైతులు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తండా వాసులు వాపోయారు.