మహబూబాబాద్ : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మన ఊరు – మన ఎమ్మెల్యే 5వ రోజు కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండలం తారసింగ్ తండా, పాత తండా, సప్పిడి గుట్ట తండా గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే పలు తండాల్లో నల్ల తామర పురుగు సోకిన మిర్చి తోటలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నాడని తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణ రావు, ఎంపీపీ చంద్ర మోహన్, జెడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, నజీర్ అహ్మద్, రవిచంద్రారెడ్డి, నవీన్ రెడ్డి, కముటం శ్రీను, యాకుబ్ రెడ్డి పాల్గొన్నారు.