మహబూబాబాద్ : మేడారం జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ నెల 18 న మహా జాతరకు వస్తున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, అంతే కాకుండా మహబూబాబాద్ డిపో నుంచి 115 బస్సులు మేడారంకు నడపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, చిట్యాల జనార్దన్, బుజ్జి వెంకన్న, గోగుల రాజు, గోపి, రఘు, డిపో అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.