చిన్నగూడూరు జనవరి31 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపల్లికి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది.
ఎస్సై విజయరామ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల ఐశ్వర్య(19) వరంగల్లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతు న్నది.
ఈ క్రమంలో ఇటీవల కుటుంబసభ్యులు ఆమెకు పెండ్లి సంబంధాలు చూశారు. పెళ్లి ఇష్టంలేని ఐశ్వర్య మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికులు గుర్తించేలోపు మృతి చెందింది. తండ్రి జక్కుల ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.