మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలిగా ఎంపీ కవిత ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించిన ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎంపీ కవిత, మంత్రులకు బ్రహ్మ రథం పట్టారు. అనంతరం కవితా నాయక్ టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.