మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని రైతు వేదికవద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ రైతు ఉన్నతికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, సాగు నీరు, తాగునీరు ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలతో రైతుల ఉసురు పోసుకుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లునవత్ ప్రియాంక, నాయిని రంజిత్, గుండా రాజశేఖర్, తేళ్ల శ్రీను, ఆవుల వెంకన్న, మహబూబ్ పాషా, లునవత్ అశోక్, దాము నాయక్, తప్పెట్ల వెంకన్న, తదితరులు ఉన్నారు.