మహబూబాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని దైవ కృప అనాథ ఆశ్రమంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా..మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరంచేసి కేక్ కట్ చేశారు. మంత్రి కేటీఆర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు.
కార్యక్రమంలోమంత్రి సత్యవతి రాథోడ్ , ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు , జడ్పీ చైర్మన్ బిందు, మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న, గద్దె రవి, యళ్ల పరకాల శ్రీనివాస్ రెడ్డి, యళ్ల మురళీధర్ రెడ్డి, ఎండీ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.