మహబూబాబాద్ : ప్రముఖ రచయిత, అక్షర వాచస్పతి, బహూముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ దాశరథి రంగాచార్యుల విగ్రహాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ..నాటి నిజాం రక్కసి పాలన విముక్తి కోసం తన గేయాలు, రచనలను ఆయుధంగా మలిచి పోరాటం చేసిన గొప్ప సాహిత్య యోధుడు దాశరధి రంగాచార్యులు అని ఎమ్మెల్యే కీర్తించారు. తన సోదరుడు దాశరధి కృష్ణామాచార్యులతో కలిసి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.
అంతటి గొప్ప విగ్రహ ఏర్పాటుకు సహకరించిన అడ్డగోడ కల్పన, నరేష్ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వల్లూరి పద్మ, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ కేసముద్రం డైరెక్టర్ మన్నె చెన్నయ్య, మాజీ కో ఆప్షన్ మెంబర్ అయూబ్ పాషా, మండల కో ఆప్షన్ మెంబర్ మీర్జా మోసిన్ బేగ్, టీఆర్ఎస్ నాయకులు జెన్నయ్య, నాయకులు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.