45 ఎకరాల్లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు
యుద్ధప్రాతిపదికన బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తిలో పనులను పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ
వనపర్తి, మార్చి 17 : జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ్ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ యాస్మిన్ బాషా, రా ష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం సమీకృత కలెక్టర్ సముదాయ భవనంలో అధికారుల బృందంతో కలిసి మంత్రి మీడియా తో మాట్లాడారు. వనపర్తి జిల్లాలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ ఏర్పాటు కు 45 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఇంజినీరింగ్ కళాశాల అడ్మిషన్లు తీసుకుని తరగతులను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని మంత్రి వెల్లడించా రు. ఇందుకోసం ఆ కళాశాల భవనానికి మరమ్మతులు చేసి పూర్తిస్థాయి సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జూన్ 2 తేదీలో గా ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి ప ర్యటన సందర్భంగా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ బైపాస్ రోడ్డుతోపాటు, విద్యాలయాలు నిర్మించుకోవాలని ఆదేశించారని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చే యాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్అండ్బీ ఆ ధ్వర్యంలో పనులు చేపడుతామని, భూసేకరణ సమస్యలు ఉంటే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించా రు.
పనుల్లో జాప్యం లేకుండా పూర్తిచేసి అద్భుతమైన ఫలితాలు కనబర్చాలని మంత్రి కాంక్షించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఉన్నతస్థాయి బృందం జేఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు వివరించారు. జిల్లాలో చేపట్టబోయే కళాశాలల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలోని ఎకో పార్కును పరిశీలించి మొక్కలు నాటారు. సవాయిగూడెం పంచాయతీలోని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి కలెక్టర్, సీఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్రెడ్డిని అభినందించారు. 100 పల్లెప్రకృతి వనాలను ప్రారంభించాలని కలెక్టర్కు సూ చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆ ఫ్ ఫారెస్టు దొబ్రియాల్, వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రవీందర్, మహబూబ్నగర్ ఫా రెస్టు కన్జర్వేటర్ క్షితిజ, ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు, జిల్లా అదనపు కలెక్టర్లు సంగ్వాన్, వేణుగోపాల్, ఆర్డీవో అమరేందర్, తాసిల్దార్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఈఈ దాస్యానాయక్, డీఈ దానయ్య, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.