కురవి : కురవి మండలంలోని బలపాల, నల్లెల్ల గ్రామాల్లో పలు కారణాలతో బాధపడుతున్న టీఆర్ఎస్ కుటుంబాలను డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. బలపాల లక్ష్మీతండాకు చెందిన బాదావత్ శ్రీను(డిష్ శ్రీను), అతని కూతురు ప్రమీల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో శ్రీను కాలు తొలగించగా, కూతురు ప్రమీల కాలు విరిగిందని తెలుసుకుని శ్రీను ఇంటికి వెల్లి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అదైర్యపడవద్దు.. అండగా ఉంటామని ఓదార్చారు. ప్రభుత్వం నుంచి అవకాశం ఉన్నంత వరకు సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
నల్లెల్ల గ్రామంలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ముస్తఫా తల్లి మృతిచెందగా ముస్తఫా కుటుంబాన్ని ఓదార్చారు. అదే విధంగా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు అంబటి వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ ముండ్ల రమేశ్, నామ సైదులు, బత్తుల వెంకన్న, బాలవర్థన్, ప్రతాపని బిక్షమయ్య పాల్గొన్నారు.