పెద్దవంగర : రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని రైతులు అధైర్యపడొద్దని, క్రయ విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు చిట్యాల గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో చేపడుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, గతేడాది రైతులు పంపించిన ధాన్యం కంటే ఈ సీజన్లో ధాన్యాన్ని ఎక్కువ పండించడం జరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా ఆరబెట్టి మ్యాచర్ వచ్చిన తర్వాతే, నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రలాకు తరలిస్తే ప్రభుత్వ అందిస్తున్న మద్దతు ధర అందుతుందని రైతులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల వసతులు కల్పించాలని నిర్వహకులకు సూచించారు. రైతన్నలు వ్యవసాయంలో ఆరుకాలం కష్టించి పండించిన పంటలను గ్రామాల్లోని రైతులు పండించిన ధాన్యన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను పొందాలని, గ్రామాల్లో చిల్లర కాంటా దళారు వ్యాపారలను ఆశ్రయించి నష్టపోద్దాన్నారు. కేంద్రాల్లో సమస్యలు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల ఫోన్ నెంబర్లను రైతులకు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టి తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఐకేపీ సిబ్బందికి రైతు సమన్వయ సమితి కన్వీనర్లు సహకరించి, తూకం వేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నగదు బదీలి అయ్యేలా ట్యాబ్లలో నమోదు జరిగేలా సహకరించి, దళారులు కొనుగోలు చేసిన ధాన్యన్ని కేంద్రాలకు తరలిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు ఐకేపీ సిబ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చారించారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకంతో పాటు ఆధార్, బ్యాంక్ ఖాతాలను వెంట తీసుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, డీపీఆర్వో శ్రీనివాస్, డీఎస్ఓ నర్సింగారావు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ మహేందర్, తాసిల్దార్ సరితరాణి, ఐకేపీ డీపీఓ నళినినారాయణ, ఐకేపీ ఏపీయం వీరయ్య, పీఏసీఎస్ సీఈవో మురళీ, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.