మహబూబాబాద్ : జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సుముదాయం, మున్సిపాలిటీ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృషి పెట్టారన్నారు.మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయడమే సీఎం లక్ష్యం అని అన్నారు. మౌలిక వసతులు, పార్కింగ్,పచ్చదనం లాంటి అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచనలు చేసారు.
అంతే కాకుండా సీఎం కేసీఆర్ వీటి నిర్మాణం పూర్తి కాగానే వీటి ప్రారంభానికి వస్తారన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎంబా ఫరీద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, యాళ్ల మురళీధర్ రెడ్డి, గోగుల రాజు, హరిసింగ్, ఎలేందర్ తదితరులు ఉన్నారు.