కొడకండ్ల, నవంబర్ 27 : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయని డీసీసీబీ వైస్చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశానుసారం, మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాలకు పార్టీ ఇన్చార్జీలను నియమించారు. ఈ సందర్భంగా సిందె రామోజీ మాట్లాడుతూ గ్రామాల ఇన్చార్జీలు కార్యకర్తలను సమన్వయం చేస్తూ, గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ పథకాలను, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని తెలిపారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం కమిటీని ప్రకటించారు. లక్ష్మక్కపల్లి గ్రామానికి దీకొండ రమేశ్, రామన్నగూడెంకు కే కృష్ణమూర్తి, పెద్దబాయితండాకు జడ్పీటీసీ కేలోతు సత్తెమ్మభిక్షపతి, బోడోనికుంటతండాకు రమేశ్, మొండ్రాయికి పేరం రాము, గిర్నితండాకు మేటి సోమరాములు, మైదంచెరువుతండాకు అందె యాకయ్య, నీలిబం డ తండాకు ఎంపీపీ ధరావత్ జ్యోతిరవీంద్రనాయక్, చెరువుముందుతండాకు సిందె రామోజీ, రామేశ్వరానికి కైరోజు సత్యనారాయణ, రామవరానికి బాకీ ప్రేమ్కుమార్, పాకాల కీసర ఉమేందర్రెడ్డి, కడగుట్టతండాకు పసునూరి మధుసూదన్, కొడకండ్లకు దీకొండ వెంకటేశ్వర్రావు, హక్యతండాకు కే అమరేందర్రెడ్డి, గుమ్మలబండతండాకు ఎండీ అసీఫ్, నర్సింగాపురానికి చెంచు రాజిరెడ్డి, ఏడునూతులకు జక్కుల విజయమ్మ, రంగాపురానికి ఎండీ నజీర్, రేగులకు వల్లపురెడ్డి సుధీర్రెడ్డి, రేగులతండాకు దూపతి సోమారెడ్డిలను నియమించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.