తొర్రూరు, అక్టోబర్ 11; వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వరి, పత్తి సహా మిరప చేన్లలో నీరు నిలిచి పలు రకాల తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. అయితే రైతులు అప్రమత్తంగా ఉంటూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాల నుంచి బయట పడవచ్చని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరి, పత్తి, కంది, మిరపతో పాటు పలు పంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై, తెగుళ్ల నివారణకు వినియోగించాల్సిన మందులపై రైతులకు వారు సూచనలు చేశారు.
పత్తి ప్రస్తుతం కాయలు ఏర్పడే దశ నుంచి కాయలు పగిలే దశలో ఉండడం వల్ల ముందుగా చేనులో నిలువ ఉన్న నీటిని బోదెలు తీసి బయటకు పంపాలి. వర్షాల వల్ల పత్తిలో వడలు తెగులు(పారా విల్ట్) సోకే అవకాశం ఉన్నందున మొకల మొదలు తడిచేలా ఒకసారి కార్బండిజం, మాంకోజెబ్ కలిసిన 2.5 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకడైతే కాయలు పగిలాయో అకడ కాయకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. వర్షాలు నిలిచిన వెంటనే పూర్తిగా విచ్చుకున్న కాయల నుంచి పత్తిని తీయాలి, వీలైతే ఒకసారి ప్రొపికోనజోల్ అనే మందును ఒక మిల్లీలీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 80 నుంచి 90రోజుల దశలో ఉన్న పత్తి పంటకు పైనుంచి ఒకసారి మల్టీకే(13-0-45) 5 గ్రాములు, ఫార్ములా-6 ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షణ బుట్టలను అమర్చి ఒకసారి థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరిలో ఇలా..
వరి పంట ప్రస్తుతం శాఖీయోత్పత్తి దశ నుంచి ఈనిక దశలో ఉన్నందున కాల్వల కింద సాగు చేసిన పంటలలో ఎకువగా సుడిదోమ ఆశించే ఆసారం ఉంది. పొలంలో నిల్వ ఉన్న నీటిని తీసేసి దోమ ఉధృతి ఉందో లేదో గమనిస్తూ ఉండాలి. ఒక దుబ్బుకి 15 నుంచి 20 సుడిదోమలు కనిపిస్తే ఒకసారి పైమెట్రోజన్ 0.6 గ్రాముల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వీలైతే చివరి దఫాగా వేసే నత్రజని ఎరువు (యూరియా)ను వేయకూడదు. కంకులు ఏర్పడే దశలో ఉన్న వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతి ఎకువగా ఉంటుంది. దీని నివారణకు ఒకసారి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. సన్నగింజ రకాల్లో గత 2-3 సంవత్సరాల నుంచి అక్టోబర్ మాసంలో వర్షాలు కురవడం వల్ల గింజ మచ్చ తెగులు, మాని పండు తెగులు, కంకినల్లి ఆశించే ఆసారం ఉంటుంది. అందుకోసం పంట పూర్తిగా ఈనిన తర్వాత ఒకసారి స్పైరోమెసిఫెన్ 1 మి.లీ, ప్రొపికొనజోల్ 1 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ తెగుళ్లు అదుపులో పెట్టవచ్చు.
కంది
పూత దశలో ఉన్న కంది పంటకు పైనుంచి ఒకసారి మల్టీ-కే(13-0-45) 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తొలి కాయలు ఏర్పడే దశలో కాయతొలిచే పురుగుల నివారణకు ఒకసారి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాముల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, కాయ రాలడాన్ని నివారించేందుకు ఒకసారి ప్లానోఫిక్స్ అనే మందును 0.2 మిల్లీలీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయలు, పండ్ల తోటల్లో..
అధిక వర్షాల వల్ల మిరప, టమాట, వంకాయ తోటలో కాయకుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున దీని నివారణకు కార్బెండజిం, మాంకోజెబ్ 2 గ్రామలు లేదా రిడోమిల్ ఎంజెడ్ 2.5 గ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, ప్లాంటామైసిన్ 2 గ్రాముల మందును 10 లీటర్ల నీటిలో కలిపి మొక మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. బొప్పాయి కాయలపై కన్ను మచ్చ తెగులు కనిపిస్తే కార్బెండజిం, మాంకోజెబ్ 2 గ్రాములు లేదా ప్రాపినెబ్ లేదా కాపర్ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాలతో పాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంటలకు సోకే తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తండా ఉండాలి. నివారణ చర్యలు తీసుకోవాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు పాటించాలి. అధీకృత డీలర్ల వద్దనే నాణ్యమైన పురుగు మందులు కొనుగోలు చేసి విధిగా రశీదులు తీసుకుని అధికారుల సూచనల మేరకు ఈ మందులు వినియోగించాలి.
– కుమార్యాదవ్, ఏవో, తొర్రూరు