మహబూబాబాద్, ఆగస్టు 26 : అనాథలను ఆదుకున్న ఆదర్శమూర్తి మదర్థెరిసా అని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఫారెస్టు కార్యాలయం సెంటర్లో యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మదర్థెరిసా జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్నాయక్ మాట్లాడుతూ… అనాథలపై అమ్మ ప్రేమను చూపి ఆదరించి, వారి భవిష్యత్ కోసం పాటుపడిన మానవతామూర్తి మదర్థెరిసా అని, ఆమె స్ఫూర్తితోనే నేడు దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు వెలసి అనాథ పిల్లలు, వృద్ధులను ఆదుకుంటున్నాయని తెలిపారు. అనాథలకు సేవ చేయాలంటే మానవతా దృక్పథంతోపాటు మాతృ హృదయం ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. అనాథాశ్రమాలు నిర్వహిస్తున్న వారందరికీ మదర్థెరిసా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం దళితబంధు పథకం ద్వారా కేటీఆర్ కాలనీలో కొండ్ర ఎల్లయ్య ఏర్పాటు చేసిన సాక్షి టెంట్ హౌస్, నెహ్రూసెంటర్లో సురేశ్ ఏర్పాటు చేసిన సెల్ వరల్డ్ను ఎమ్మెల్యే శంకర్నాయక్ ప్రారంభించారు. దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థికసాధికారత సాధించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల రాజు, కౌన్సిలర్ బాలూనాయక్, యూత్ పట్టణ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, వైఎంసీఏ అధ్యక్షుడు ఎస్జే సూర్యారావు, సెక్రటరీ బొడ్డు సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ లివింగ్ వాటర్, కౌన్సిలర్ బుజ్జి వెంకన్న, క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యులు జన్ను అనితామహేందర్, చిదిరాల శరత్, రాజ్కుమార్, మందుల రఘు, జగన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
మహబూబాబాద్ రూరల్ : సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్నాయక్ తెలిపారు. శుక్రవారం మాధవాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేకశ్రద్ధతో ‘మన ఊరు – మన బడి’ సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంకా భద్రీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.