మహబూబాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుంచి వరుసగా వాన లు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి వర్ష పు నీరు వచ్చి చేరింది. దీంతో జిల్లాలో వ్యవసాయ ప నులు జోరందుకున్నాయి. రైతులతో పాటు వ్యవసా య కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నుతున్నారు. వరినారు పెట్టేందుకు నారు మళ్లను రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లాలో 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని ప్రణాళిక సిద్ధం చేశా రు. వరి-1,80,200 ఎకరాలు, పెసర్లు-8,284, కందులు-12,036, వేరుశనగ-610, మిర్చి 65, 200, పసుపు-4,620 ఎకరాలు, మక్కజొన్నలు- 32,630, పత్తి-1,40,600, ఇతర పంటలు- 16, 400 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. 2021 వానకాలం సీజన్లో 4,51,812 ఎక రాల్లో రైతులు వివిద పంటలను సాగు చేశారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8,768 ఎకరాల్లో అదనంగా సాగు చేయనున్నారు.
యూరియా పుల్..
వ్యవసాయశాఖ ప్రణాళిక ప్రకారం విత్తనాలు, ఎరు వులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో యూరియా 12,314 మెట్రిక్ టన్నులు, డీఏపీ-1, 953 మెట్రక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు-6,371 మెట్రిక్ టన్నులు, పొటాష్-280 మెట్రిక్ టన్నులు, సూపర్ పాస్పేట్-729.60 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతుల కోసం వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా విత్తనపు వడ్లు-54,100 క్విం టాళ్లు, పత్తి గింజలు-261 క్వింటాళ్లు, మక్కజొన్న- 2,81,200 ప్యాకెట్లు, కందులు- 610 క్వింటాళ్లు, పెసర్లు-332 క్వింటాళ్లు, వేరుశనగ-482 క్వింటాళ్లు, 650, పసుపు 480, ఇతర విత్తనాలు 650 క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉన్నాయి.
విత్తనాలు, ఎరువులు సిద్ధం
వానకాలం సాగుకు అనుకూలంగా రైతుల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 21,687 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పంటలకు సం బంధించిన విత్తనాలు కూడా ఉన్నాయి. జనుము, జీలుగ విత్తనాలను 60శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాం.
– ఛత్రూనాయక్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి