కురవి, జూన్ 22: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో అశేష భక్త జనవాహి ని కదలిరాగా.. వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 8:02 గంటలకు రేవతి నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమున చతుర్థిక్షు రాజగోపుర శిఖర, ధ్వజ స్తంభ, ఆంజనేయస్వామి, నవగ్రహ, నాగబంధన యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవం కన్నులపం డువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. వేద పండితులు శివకిరణ్, బా లకృష్ణ, అనిల్, శ్రీకాంత్ తదితరులు గణపతి పూజ, ప్రా తరౌపాసరం, మూలమంత్ర హవనములు, మహా పూ ర్ణాహుతి, జీవ న్యాసం, ప్రాణప్రతిష్ఠ, ఆలయ శిఖర విగ్ర హం, రాజగోపురానికి మహాకుంభాభిషేకం, దిష్టికుం భం, మహాదర్శనం గావించారు. వీరభద్రస్వామి, భద్ర కాళీ అమ్మవార్ల శాంతికల్యాణమహోత్సవం జరిగింది. ఆహుతులకు చతుర్విద పండితుల మహాదాశీర్వచనం చేశారు. మూడు రోజులుగా కొనసాగుతున్న పూజల కు ఎటువంటి ఆటంకం కలుగకుండా కురవి ఎస్సై రామునాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
కార్యక్రమానికి సహకరించిన వారికి ఆలయ చైర్మన్, ఈవో కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ చైర్మన్ రాము నాయక్, ఈవో సత్యనారాయణ దంపతులు, పాలక మండలి సభ్యులు సీహెచ్ మల్లయ్య, మేక నాగిరెడ్డి, కొణ తం విజయ్, బదావత్ లక్ష్మి, ఆలయ మాజీ చైర్మన్ రాజు నాయక్, దామోదర్రెడ్డి, వీరాచారి, కన్నెగంటి వెంకటర మణ, సీహెచ్ శ్రీను, రాజు, బానోత్ రమేశ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాలధారులు బాదె నాగయ్య, కన్నె వెంకన్న, నర్సయ్య, రవీంద్రాచారి, కలగూర నాగరాజు, కోనేటి వీరన్న, సుమన్, గజ్జెల్ల వీరన్న, జీ కృష్ణ, రాము, నాగరాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ పూజలు
కురవి ఆలయంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనా మహో త్సవానికి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహ బూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత వేర్వేరుగా హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. వారి వెంట మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మో హన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బజ్జూరి ఉమ, ఎం పీపీ గుగులోత్ పద్మావతి, మరిపెడ ఆత్మ చైర్మన్ తోట లా లయ్య, కురవి సర్పంచ్ నూతక్కి పద్మానర్సింహారావు, ఎంపీటీసీ చిన్నం భాస్కర్, విజయ్, మాజీ జడ్పీటీసీ కవి త, రమేశ్, జిల్లా నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ గుగులోత్ రవి, వెంకటరమణ, వెంక న్న, దైద భద్రయ్య, రమేశ్, వీరన్న, సూర్యానాయక్, సులోచన, మేక నాగిరెడ్డి, ఎడబత్తని పవన్ పాల్గొన్నారు.