నర్సింహులపేట, మే 23 : తండాల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని రూప్లాతండా గ్రామ పం చాయతీ పరిధిలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం వీధిలైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, వాటి అభివృద్ధి కోసం నిధులు కేటాయిం చనున్నట్లు తెలిపారు. ప్రతి తండాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దుర్గామాతను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు టేకుల యాదగిరెడ్డి, వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, మైదం దేవేందర్, సర్పంచ్ గుగులోతు లక్ష్మి, దాసరోజు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, రామన్న, నగేశ్, బిచ్చు, శ్రీను, జంపయ్య, శంకర్, చంద్రు తదితరులు ఉన్నారు.
ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
చిన్నగూడూరు : రామలింగేశ్వరస్వామి ఆలయ నిర్మా ణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ సూచించారు. మండలంలోని ఉగ్గంపల్లిలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై కంట్రాక్టర్, దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్యా మాట్లాడుతూ వారం రోజుల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉన్నందున నిర్మాణ పనులను పూర్తి చేసి, అందంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలన్నారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆయూబ్పాషా, మండల పార్టీ అధ్యక్షులు రాంసింగ్, నాయకులు కొమిరెల్లి, మల్లేశ్, అంబరీష, యాకూబ్, సాయి, గ్రామస్తులు ఉన్నారు.
గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు..
మండల కేంద్రంలోని గంగమ్మ ఆల యం వద్ద యాదవ కులస్తులు గంగమ్మ తల్లికి బోనాలు చెల్లించగా, రెడ్యా సోమవారం ఆలయానికి చేరుకుని మహిళలతో కలిసి బోనమెత్తుకుని తల్లికి సమర్పించుకున్నారు. అనంతరం కుల పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ మల్లయ్య, వైస్ ఎంపీపీ వీరన్న, సంఘ పెద్దలు మీసాల వెంకన్న, శంకర్, ఉపేందర్, ఐలయ్య, కృష్ణ , టీఆర్ఎస్ నాయ కులు ధారాసింగ్, చెన్నయ్య, మోసిన్ బేగ, జన్నయ్య ఉన్నారు.
వధూవరులకు ఎమ్మెల్యే రెడ్యా ఆశీర్వాదం
మరిపెడ: మండలంలోని ఎల్లంపేట శివారు బొట్యతండాలో సోమవారం జరిగిన టీఆర్ఎస్ నేత గుగులోత్ శంకర్ కూతురు సంధ్య-జైల్సింగ్ కల్యాణంలో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఎంపీపీ గుగులోత్ అరుణ, కే శ్రీనివాస్ రెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, డా.రవి, జిల్లా మైనార్టీ సెల్ నాయకులు ఎండీ ఆయూబ్ పాషా, వెంకన్న, భరత్కుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పచ్చిరొట్టతో అధిక దిగుబడి
జీలుగ, జనుము సాగుతో రైతులు సహజ సిద్ధంగా భూసారాన్ని పెంచుకుని లబ్ధి పొందాలి. 25 నుంచి 30శాతం మంది రైతులు పచ్చిరొట్ట సాగు చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయాలి. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నది. 65శాతం సబ్సిడీపై 30 కిలోల జీలుగ విత్తనాలు అందిస్తున్నది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పచ్చిరొట్టతో రైతులకు 50శాతం ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యకర ఉత్పత్తులను పొందవచ్చు. -రామకృష్ణ, ఏవో ఇన్చార్జి