మహబూబాబాద్, మే 16 : వర్షాకాలం సీజన్లో దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ జ్వరాన్ని నిర్మూలించేందుకు ప్రజలందరూ ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్యశాల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రాజ్ మాట్లాడుతూ.. 2019 నుంచి జిల్లాలో 216 డెంగీ కేసులు నమోదయ్యాయని, 2021లో 43 కేసులకు పరిమితం చేశామని, ఇందులో ప్రజల జాగ్రత్త చర్యలు చాలా ముఖ్యమైనవని గుర్తు చేశారు. 2022 జనవరి నుంచి నేటి వరకు 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఇళ్లలో ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం చేపట్టి ఇంటి పరిసలు, ప్రాంతాలు, వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి ఆవరణకు అవతల ఎలాంటి చెత్త ఉన్నా మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుధీర్రెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి అంబరీష, డిప్యూటీ డెమో కొప్పు ప్రసాద్, సీహెచ్వో కృష్ణార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్ నవీన్, సబ్ యూనిట్ అధికారులు వీ శ్రీనివాస్, సాంబశివరావు, గోపి, షాహిముద్దీన్, రామకృష్ణ, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆరోగ్య, ఆవ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మహబూబాబాద్ రూరల్: డెంగీ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కంబాలపల్లి పీహెచ్సీ వైద్యుడు సుధీర్ నాయక్ అన్నారు. సోమవారం సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్యకేంద్రం సూపర్ వైజర్లు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
డోర్నకల్లో అవగాహన ర్యాలీ
డోర్నకల్: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పీహెచ్సీ వైద్యాధికారిణి కనకదుర్గ అ న్నారు. సోమవారం పీహెచ్సీ నుంచి రాజు తండా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.కార్యక్రమం లో సూపర్వైజర్లు విజయలక్ష్మి, వెంకన్న, శారద, హె ల్త్ అసిస్టెంట్ వెంకట్రావు, రత్నాకర్, ఉపేందర్ పాల్గొన్నారు.
జాగ్రతలు పాటించాలి
నర్సింహులపేట: డెంగీ జ్వరం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎన్ఎం ప్రసన్న సూచించారు. మండల కేంద్రంలో అవగాహన ర్వాలీ నిర్వహించారు. వైరస్ సోకిన 14 రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపై దద్దర్లు వస్తాయని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
దంతాలపల్లిలో మానవహారం..
దంతాలపల్లి: మండల కేంద్రంలోని పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ఇన్చార్జి వైద్యాధికారి విజయ మాట్లాడుతూ.. ప్రజలు దోమ లు కుట్టకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. సీహెచ్వో బాలాజీ, హెచ్వీ రమణ, హెల్త్ అసిస్టెంట్లు సత్యనారాయ ణ, చలపతి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
చిన్నగూడూరులో..
చిన్నగూడూరు: ఉగ్గంపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మండల కేంద్రంలోని దాశరథి సెంటర్ నుంచి గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం, సూపర్వైజర్ రాధాకుమారి, సిబ్బంది వీరయ్య, వనిత, అనిత, భారతి, పుష్ప, ఉపేంద్ర, కళావతి, జ్యోతి, సంధ్య, నిర్మల, సైదమ్మ ఉన్నారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
నెల్లికుదురు: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెడికల్ ఆఫీసర్ అవినాశ్కుమార్ తెలిపారు. మండలంలోని పీహెచ్సీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు డెంగీ నివారపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు మంగమ్మ, రవి, ఏఎన్ఎంలు, ఆవ వర్కర్లు భూలక్ష్మి, రోజారాణి, లక్ష్మీప్రసన్న, మహేశ్వరి, కవిత, సునీత, సుజాత, ఉమ, స్వరూప, రజిత, రాణి తదితరులు పాల్గొన్నారు.