బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం (Bayyaram) మండలం కోడిపుంజుల తండాలో పెండ్లింట విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్తో నవ వరుడు మృతిచెందగా, వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. కోడిపుంజుల తండా వాసి ఇస్లావత్ నరేశ్కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న విజయవాడలో వివాహం జరిగింది. అనంతరం నూతన జంట వరుడి స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రిసెప్షన్ జరగాల్సి ఉన్నది.
ఇందులో భాగంగా ఇంట్లోని బోరు మోటరు కోసం విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా నరేశ్కు షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. జాహ్నవి కూడా అస్వస్థతకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు. పెండ్లి వేడుక సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఉన్నసమయంలో ఈ ఘటన చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.