హైదరాబాద్ : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వికారాబాద్ జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు.
రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయిన చుట్టుముట్టి నిరసన తెలిపారు. చేసేదేమి లేక ఎమ్మెల్యే ప్రమాద స్థలం నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు.
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత
ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు
రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం
నిత్యం ఈ… https://t.co/zPEQ72vAv0 pic.twitter.com/R6fvY0uarz
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2025