పాలకుర్తి, జనవరి 1: మహాకవులు పాల్కురికి సోమన, బమ్మెర పోతన, వాల్మీకి మహర్షి నడయాడిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను మహబూబ్నగర్ జిల్లా వేముల పాఠశాల విద్యార్థులు సోమవారం సందర్శించారు. మహాకవుల గురించి పాఠ్యపుస్తకాల్లో చదవడమే తప్ప వారి స్వస్థలాల సందర్శనకు రావడం విశేషమని ప్రముఖ సాహితీవేత్త, పాఠ్యపుస్తక రచయిత పల్లెర్ల రామమోహన్రా వు అన్నారు.
పాలకుర్తిలోని సోమనాథుడి స్మృతివనం, బమ్మెరలోని పోతన మందిరం, వల్మిడిలోని శ్రీరాముడి ఆలయాలను విద్యార్థులు సందర్శించా రు. ఈ కార్యక్రమంలో సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, శంకరమంచి శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయుడు బీ రాజేశ్వర్ పాల్గొన్నారు.