పర్వతగిరి, సెప్టెంబర్ 7: మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామ చెరువులో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.35వేల విలువైన 45వేల చేప పిల్లలను వదిలారు. అనంతరం ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సంబంధించిన రూ.10లక్షల ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ మత్స్యకార్మికుల కష్టాలు తీరాయన్నారు. డబ్బులు పెట్టి చేపపిల్లలను పెంచే స్తోమత లేకపోవడంతో వారు ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేశారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార్మికుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. చేపపిల్లల పెంపకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
దేశంలో పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం పలు గ్రామాలకు చెందిన 39 మంది కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.39లక్షల 4వేల 524 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ సాయంతో ఎంతో మంది పేదలకు పెండ్లి భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు ఆర్థికసాయం బాధితులకు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 6 చెక్కులను రూ.లక్షా 80వేల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్గౌడ్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, మార్కెట్ డైరెక్టర్లు శాంతిరతన్రావు, ఏకాంతంగౌడ్, మాజీ జడ్పీటీసీలు మేడిశెట్టి రాములు, పంతులునాయక్, సర్పంచులు యశోద బాబు, చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, పంజా మహేశ్, గణేశ్, నేతావత్ ఈర్యానాయక్, జ్యోతిలకుపతి, బానోత్ వెంకన్న, రేణుక సాయిలు, కొల్లూరి వెంకన్న, సుబ్బారావు, ఎంపీటీసీలు కర్మిళ్ల మోహన్రావు, బీ.భాస్కర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయినపెల్లి యుగంధర్రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు కుమార్గౌడ్, చినపాక శ్రీనివాస్, నాయకులు దుర్గారావు, ఎండీ.సర్వర్, బాల్య వెంకటరాజు, శ్యామ్గౌడ్, బాబు పాల్గొన్నారు.