కురవి/మరిపెడ, జనవరి 17: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కనువిప్పు కలిగేలా.., తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని తరలించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఖమ్మం బహిరంగసభ జన సమీకరణ కోసం మంగళవారం కురవి మండల కేంద్రంలోని కర్షక సేవా సహకార సంఘంలో, మరిపెడ మున్సిపల్ కేంద్రంలో పార్టీ ష్ట్రాశేణులతో సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశ సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని జాతీయస్థాయిలో విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న చారిత్రక సభలో భాగస్వాములవుదామని, సీఎం కేసీఆర్ ప్రసంగంపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నదన్నారు. మండలాలకు కేటాయించిన ప్రతి బస్సు నిండేలా చూడాలని ఆదేశించారు.
నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని, గ్రామాలవారీగా బస్సు ఇన్చార్జిల లిస్టు తయారు చేయాలన్నారు. తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తను తిరిగి ఇంటికి అంతే జాగ్రత్తగా తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కష్టపడిన ప్రతి నాయకుడిని పార్టీ గుర్తిస్తుందన్నారు. ఖమ్మం బహిరంగసభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు చూడబోతున్నామన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ సుపరిపాలన దేశవ్యాప్తంగా అందించాలనే లక్ష్యం ఖమ్మం నుంచే తొలి అడుగు పడుతుందన్నారు. కురవిలో బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్, దేవోజీ, మండల అధ్యక్షుడు తోట లాలయ్య, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, జడ్పీకో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ పాషా, కేఎస్ఎన్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీదేవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఆలయ చైర్మన్ రామూనాయక్, మాజీ చైర్మన్ రాజూనాయక్, సీరోలు ఎంపీటీసీ భోజ్యానాయక్, నూతక్కి నర్సింహారావు, వైస్ ఎంపీపీ డీ నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ పీ వెంకన్నగౌడ్, మేక నాగిరెడ్డి, మల్సూర్, విజయ్, కురవి ఉపసర్పంచ్ సంగెం భరత్, మల్లికార్జున్, వెంకన్న, బండారి రమేశ్, బెడద వీరన్న, దైద భద్రయ్య, కాట్యాల వీరన్న, మరిపెడలో ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, రామడుగు అచ్యుత్రావు, టీఎస్ ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీను, ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మహేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ అశోక్రెడ్డి, కాలూనాయక్, పానుగోత్ వెంకన్న, శ్రీపాల్రెడ్డి, తదితలు పాల్గొన్నారు.
పాలకుర్తి నుంచి 15వేల మంది
ఖమ్మంలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 15వేల మంది తరలిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేతలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అన్ని గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య నేతలు, తొర్రూరు మున్సిపాలిటీలోని నాయకులతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు ఇచ్చారు. ఆర్టీసీకి అద్దె చెల్లించి ప్రతి గ్రామానికి బస్సులు ఏర్పాటు చేశామని, వీటితోపాటు ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో ఖమ్మం సభకు తరలివచ్చేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
తొర్రూరు మండలంలో 51, మున్సిపాలిటీలో 25 బస్సులు, రాయపర్తి మండలం నుంచి 60, పెద్దవంగర మండలం నుంచి 31 బస్సులతోపాటు వందలాది ప్రైవేట్ వాహనాలను పార్టీ శ్రేణులు సమకూర్చుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి సుమారు 15వేల మందికి పైగా ఖమ్మం సభకు వెళ్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, జడ్పీటీసీ శ్రీనివాస్, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, డాక్టర్ పీ సోమేశ్వర్రావు, ఆర్ కిశోర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, వంశీధర్రెడ్డి, గాంధీనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు నలమాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.