కేసముద్రం, డిసెంబర్ 9 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. మార్కెట్ ఆవరణ ధాన్యపు రాశులతో నిండి పోయింది. జైశ్రీరాం రకం క్వింటాలు రూ.2619, ఆర్ఎన్ఆర్ క్విం టాలుకు రూ.2237 ధర పలికింది. అయితే, గాలి, తేలిక పాటి చినుకులు పడడంతో రైతులు ఆందోళన చెందారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు.
మామూలు వర్షం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు ఆదేశాల మేరకు షెడ్ బయట ఉన్న ధాన్యానికి వెంటవెంటనే కాంటాలు పెట్టారు.