రఘునాథపల్లి, నవంబర్ 14 : స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరేలా కృషి చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించా రు. మండలంలోని నిడిగొండ శివారులోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మం డలస్థాయి విసృతస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వారాల రమేశ్ యాదవ్ అధ్యక్షత వహించగా, కడియం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ నెల 15,16,17 తేదీల్లో మొక్కుబడిగా కాకుండా పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి, 18,19న మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి కారుగుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రూ. 11 వందల పెన్షన్, వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ ఇస్తున్న తీరును, ప్రజలకు అర్థ్ధమయ్యేలా వివరించాలన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేయాలన్నారు.
ఈ నెల 20 స్టేషన్ఘన్పూర్ సమీపంలోని శివారెడ్డిపల్లెలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్మే అభ్యర్థి కడియం శ్రీహరి కోరారు. ప్రతి బూత్ నుంచి రెండు వందల మందికి తక్కువ కాకుండా సుమారు రూ.10 వేల మందిని రఘునాథనపల్లి మండలం నుంచి తరలించి కాంగ్రెస్ పార్టీ పారిపోయేలా చేయాలన్నారు.
బీఆర్ఎస్ అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పాలా కాపాడకుంటానని కడియం శ్రీహరి అ న్నారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్కు నష్టం చేయాలని చూస్తున్నారని వారి ఎత్తులను తిప్పికొట్టి స్టేషన్ఘన్ఫూర్లో లక్ష మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధ్దులై సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొల్లం అజయ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్ యాదవ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాంబాబు, ప్రముఖ వైద్యుడు బొల్లపల్లి కృష్ణ, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్, మాజీ ఎంపీపీ వై కుమార్గౌడ్, బీఆర్ఎస్ మండల కార్యదర్శి అశోక్, యూత్ మండలాధ్యక్షుడు హరీశ్గౌడ్, నాయకులు బుచ్చయ్య, గొరిగె రవి, మడ్లపల్లి సునితా-రాజు, హుస్సేన్, లోనే స్రవణ్కుమార్, వడ్లకొండ శివప్రసాద్, మధు, యాకస్వామి, వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
చిల్పూరు : స్టేషన్ఘన్పూరల్ నియోజకవర్గంలో ఎ గురేది బీఆర్ఎస్ జెండానే అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పల్లగుట్ట క్రాస్లోని ఈఆర్ఎల్ గార్డెన్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూక్యా రమేశ్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మె ల్యే అభ్యర్థి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ చాగల్ గ్రామ శివారులోని శివరెడ్డిపల్లి సమీపంలో నవంబర్ 20న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు మారెపల్లి శ్యామ్కుమార్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భూక్యా రమేశ్నాయక్, ఎంపీపీ బొమ్మిశేట్టి సరితాబాలరాజు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్ రావు, మదాసి వెంకటేశ్, సొసైటీ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, మండల రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ జనగామ యాదగిరి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పోల్లెపల్లి రంజిత్రెడ్డి, కేశిరెడ్డి మనోజ్రెడ్డి, జాతీయ చేనేత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జి గజ్జేల దామోదార్, మాజీ ఎంపీపీ పాగాల సుధాకర్రెడ్డి, నియోజవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రంగు రమేశ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ కో ఆర్డినేటర్లు ఇల్లందుల సుదర్శన్, బీఆర్ఎస్ మండల నాయకులు బొమ్మిశేట్టి బాలరాజు, పొన్నం శ్రీనివాస్, ఎండీ షకీల్, తాళ్లపల్లి రాజ్కుమార్, గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.