హుస్నాబాద్, అక్టోబర్ 4: ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలను, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర గిరిజన, కేసీఆర్ మూడో సారి సీఎం కావడం ఖాయమని స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, మండలంలోని జిల్లెలగడ్డ గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూళ్లకు బుధవారం ప్రారంభోత్సవం, రూ.5కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు కేటాయించారని, 500జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీలుగా మార్చి సొంతంగా పరిపాలన చేసుకునే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. తెలంగాణ రాకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు కేవలం 263 మాత్రమే ఉండేవని, ఇందులో కేవలం 90వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారన్నారు. తెలంగాణ వచ్చాక 1,008గురుకుల పాఠశాలను స్థాపించినట్లు చెప్పారు. వీటిలో 7లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చాకే సేలాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని, హుస్నాబాద్లో త్వరలోనే సేవాలాల్ దేవాలయం నిర్మాణానికి కృషి చేస్తామన్నా రు. ఎన్నికలప్పుడే తండాలకు వచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ వాళ్లను నమ్మొద్దని సూచించారు. మూడోసారి కేసీఆర్ను సీఎం, వొడితల సతీశ్కుమార్ను హుస్నాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించడంలో గిరిజనులు భాగస్వాములు కావాలన్నారు.
గిరిజనతండాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : ఎమ్మెల్యే సతీశ్కుమార్
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజన తండా ల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని 54తండాల్లో పలు తండాలకు రూ.51కోట్లతో తారు రోడ్ల నిర్మాణం చేశామన్నారు. ఇంకా కొన్ని తండాలకు త్వరలోనే రోడ్లు వేయిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని 15తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే చెం దుతుందన్నారు. దీంతో గిరిజనులే తమ తండాలను పాలించుకునే అవకాశం దక్కిందన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్లో రూ.3కోట్లతో బంజారా భవన్ నిర్మాణం కూడా పూర్తి కాబోతున్నట్లు వివరించారు. హుస్నాబాద్లో బాలురు, బాలికల గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లు, రెండు కస్తూర్బా పాఠశాలలు, మరో రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.25లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. అక్కన్నపేట మండలానికి మంజూరైన గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి త్వరలోనే 7ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చా రు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం లో మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడేలా బంజా రా ఆడబిడ్డలు, యువత, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బతుకమ్మ చీరెల పంపిణీ..
హుస్నాబాద్లోని సిద్ధార్థ హైస్కూల్ ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీని ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి మంత్రి సత్యవతి ప్రా రంభించారు. పలువురు మహిళలకు స్వయంగా చీరెలు అందజేశారు. ఆడబిడ్డలకు తండ్రిగా, అన్నగా సీఎం కేసీ ఆర్ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘన త కూడా ఆయనదేనన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చాక మహిళలకు సముచితస్థానం కల్పిస్తున్నారని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పి స్తున్నారని అన్నారు. కార్యక్రమాల్లో హనుమకొం డ జి ల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.