రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం 44 శిబిరాల్లో 15,759 మందికి వైద్యులు, సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 9,869 మందికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. 5,890 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందించేందుకు వివరాలు నమోదు చేసుకున్నారు. మసక బారిన కళ్లకు పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తూ జీవితాలకు వెలుగులు పంచుతున్న సీఎం కేసీఆర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లోని కేశవాపురం, లక్ష్మీపురం పీహెచ్సీలను డీఎం హెచ్వో వెంకటరమణ సందర్శించారు. వైద్యులు, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు.
గిర్మాజీపేట, జనవరి 27 : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో 15,759 మందికి పరీక్షలు నిర్వహించి 9,869 మందికి రీడింగ్ గ్లాసులు, 5,890 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేసినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. జిల్లాలో 44 కంటివెలుగు శిబిరాల్లో 37,424 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని అందులో 9,869 మందికి రీడింగ్ అద్దాలను అందించినట్లు ఆయన తెలిపారు. 5,890 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారన్నారు. దుగ్గొండి మండలంలోని కేశవాపురం, లక్ష్మీపురం పీహెచ్సీలతో పాటు నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్వో విస్తృతంగా పర్యటించారు. వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నామని, కేంద్రాల్లో సమస్యలు ఉంటే కంటివెలుగు జిల్లా ఎమర్జెన్సీ మానిటరింగ్ సెల్ సెంటర్ నుంచి పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంటివెలుగు ప్రోగ్రాంలో పాల్గొనాలన్నారు. జిల్లా కంటివెలుగు ప్రోగ్రాం అధికారి గోపాల్రావు 44 కంటివెలుగు శిబిరాల్లో పరీక్షల వివరాలను వెల్లడించారు.
నర్సంపేట వార్డు 21లో 365 మందికి, రాయపర్తిలో 375 మందికి, జల్లిలో 378 మందికి, వరంగల్ వార్డు-12(దేశాయిపేట)లో 553 మందికి, ఉప్పరపల్లిలో 382, వరంగల్ వార్డు- 22 (దేశాయిపేట)లో 93, వరంగల్ వార్డు- 35(చింతల్)లో 488, వరంగల్ వార్డు- 39(ఎస్ఆర్ఆర్తోట)లో 498, ఖానాపురంలో 453, దీక్షకుంటలో 258, నెక్కొండలో 193, నల్లబెల్లిలో 259, వరంగల్ వార్డు-3(పైడిపల్లి)లో 262, పర్వతగిరిలో 227, బానోజీపేటలో 131, వర్ధన్నపేట వార్డు-3(రాయపర్తి)లో 99 మందికి, లక్ష్మీపూర్లో 178, వరంగల్ వార్డు-32(ఎస్ఆర్ఆర్తోట)లో 292 మందికి, వరంగల్ వార్డు-39(ఫోర్ట్ వరంగల్)లో 339 మందికి, అలంకానిపేటలో 221 మందికి, దుగ్గొండిలో 147 మందికి, చింతనెక్కొండలో 156, కొంకపాకలో, వరంగల్ వార్డు-42(రంగశాయిపేట)లో 396, సంగెంలో 371, వరంగల్వార్డు-21(చింతల్)లో 365, వరంగల్ వార్డు-19(కాశీబుగ్గ)లో 408, వరంగల్ వార్డు-15(గీసుగొండ)లో 444, చెన్నారంలో 283, ఇటుకాలపల్లిలో 195, వరంగల్ వార్డు-16(కీర్తినగర్)లో 257, చెన్నారావుపేటలో 317, గీసుగొండలో 334, తిరుమలాయపల్లిలో 331, ఊకల్లో 202, వరంగల్ వార్డు-37(ఫోర్ట్వరంగల్)లో 279, గవిచర్లలో 411, వంచనగిరిలో 290, వరంగల్ వార్డు-26( చింతల్)లో 329, వరంగల్ వార్డు-17(పైడిపల్లి)లో 244, మేడెపల్లిలో 168, వరంగల్ వార్డు-41(రంగశాయిపేట)లో 344, వరంగల్ వార్డు-36(చింతల్)లో 280, ధర్మారావుపేటలో 207 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ విధిగా కంటివెలుగు శిబిరాలకు నిర్ణీత సమయానికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని కోరారు.
రెండోసారి కళ్లద్దాలు తీసుకున్నా..
నర్సంపేట రూరల్, జనవరి 27 : 2018 డిసెంబర్లో తొలిసారి కంటి వెలుగు శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలను తీసుకున్నా. ఇప్పుడు మరలా కంటి పరీక్ష చేయించాను. డాక్టర్ పరీక్షించి కళ్లద్దాలిచ్చాడు. రెండో సారి కూడా నేను సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన కళ్లద్దాలను తీసుకున్నా. పైసా ఖర్చు లేకుండా నాకు కళ్లద్దాలు, మందులు ఇచ్చిన ఆయన మా ఇంటి దేవుడు.
– కొయ్యల శామ్యూల్, భాంజీపేట, నర్సంపేట మండలం