నర్సంపేట రూరల్, జనవరి 27: అంధత్వ నివారణ కోసం సీఎం కేసీఆర్ గ్రామాల్లో ఏర్పాటు చేయిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీపీ మోతె కళావతి కోరారు. చంద్రయ్యపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాల్లో నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఒరంగంటి ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, వైద్యాధికారి బానాల అరుణ్చంద్ర, కంటి వెలుగు క్యాంపు ఇన్చార్జి డాక్టర్ కవిత, మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బాషబోయిన శ్రీనివాస్, కార్యదర్శి మధు, వార్డు సభ్యుడు ఉప్పుల రాజు, ఏఎన్ఎం కోమల, గ్రామపెద్దలు రాజన్ననాయక్, వీరన్న, జీపీ సిబ్బంది సుధాకర్, ఎల్లయ్య, సురేందర్ పాల్గొన్నారు.
దృష్టి లోపాన్ని నివారించడమే లక్ష్యం
నల్లబెల్లి: ప్రజల్లో దృష్టి లోపాన్ని నివారించడమే కంటి వెలుగు కార్యక్రమ ప్రధాన లక్ష్యమని సర్పంచ్ వక్కల మల్లక్క అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు. క్యాంపు ఇన్చార్జి డాక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య నిపుణుడు సాంబరాజు గ్రామస్తులకు కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు అందజేశారు. ఆపరేషన్లు అవసరమైన వారిని వరంగల్లోని రీజినల్ నేత్ర వైద్యశాలకు రెఫర్ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ 40 ఏళ్లు పైబడిన వారికి దృష్టి లోపం వచ్చే అవకాశం ఉండడంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 18 ఏళ్లు పైబడిన వారు కంటి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శశికుమార్, దామోదర్రెడ్డి, ఎంపీటీసీ ఓదెల లక్ష్మి-రవి, బీఆర్ఎస్ నాయకుడు వక్కల చంద్రమౌళి పాల్గొన్నారు.