హనుమకొండ సబర్బన్, జూన్ 28 : వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేలేరును నూతన మండలంగా ఏర్పాటు చేశారు. వీటిలోకి గత కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలానికి చెందిన కన్నారం గ్రామాన్ని భీమదేవరపల్లికి చెందిన ఎర్రబెల్లిని వేలేరులో చేర్చారు. అయితే ఈ రెండు గ్రామాల ప్రజలు వేలేరులో చేరడానికి విముఖత చూపారు. తమ సొంత మండలాల్లోనే చేర్చాలంటూ స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్కుమార్కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో గత మే 5న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హుస్నాబాద్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్కుమార్ ఈ రెండు గ్రామాలను తిరిగి సొంత మండలాల్లో చేర్చాలని కేటీఆర్కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ రెండు నెలల్లో ఈ రెండు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కన్నారంను అక్కన్నపేట, ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి మండలాల్లోకి కలుపుతూ బుధవారం జీవో జారీ చేయించారు. దీంతో ఈ రెండు గ్రామాల్లో సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెలే సతీష్కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.