ధర్మసాగర్, నవంబర్ 5: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గెలుపు కోసం ఆదివారం మండలంలోని శాయిపేట, తాటికాయాల, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మరింతగా పెంపొందిస్తామని, రైతులకు పంటల పెట్టుబడికి ఆర్థిక సాయం పెంచనున్నట్లు వారు ఎన్నికల మ్యాప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని కోరారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలునిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పెసరు రమేశ్, శాయిపేట గ్రామ సర్పంచ్ రవీందర్ యాదవ్, రత్నకర్, మల్లేశం, ఉప సర్పంచ్ రాజు, కుమార్, వెంకట్రాజం, మహిళలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం: సీఎం కేసీఆర్ నూతనంగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను, పథకాలను ప్రతి ఇంటింటికీ చేర్చాలని మాజీ జడ్పీటీసీ గంగసాని రంజిత్రెడ్డి అన్నారు. స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని గెలిపించాలంటూ, కుందారంలో ఆదివారం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో పాటు, వాటిల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలను సైతం సీఎం కేసీఆర్ రా ష్ట్రంలో అమలు చేస్తూ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. బీఆర్ఎస్కు ఈ మండలంలో ఎదురే లేదన్నారు. అయినప్పటికీ కార్యకర్తలంతా ఐక్యంగా శ్రమించి కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పాలమాకుల నర్సయ్య, కొత్తపెల్లి నర్సింహులు, గంగపు రం నర్సింహులు, యాదగిరి, రాంచందర్, యాకన్న, పరుశరాములు, నాగరాజు, జయరాం, నరేశ్, సతీశ్, రమేశ్, భాస్కర్ పాల్గొన్నారు.