సంగెం, ఏప్రిల్ 6 : లక్షలాది మంది విద్యార్థులతో ఆటలాడుకుంటున్న బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సంగెం మండలంలోని బాలునాయక్తండా, నల్లబెల్లి, నార్లవాయి, మొం డ్రాయి, ముమ్మిడివరం, గొల్లపల్లి, పల్లార్గూడ, వీఆర్ఎన్తండా, పోచమ్మతండా, వంజరపల్లి, కృ ష్ణానగర్, చింతలపల్లి, కుంటపల్లి గ్రామాలకు చెం దిన బీఆర్ఎస్ కార్యకర్తలతో గీసుగొండలోని ఎస్ఎస్ గార్డెన్స్లో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి పాల్గొని మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు బండి సంజయ్ కుట్రపన్నాడని ఆరోపించారు. మోదీకి ప్రజాస్వామ్యం మీద గౌరవం, నమ్మకం ఉంటే బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలన్నారు.
బీజేపీ ఒక బద్మాష్, బండి బట్టెబాజ్ అని మండిపడ్డారు. మోదీ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని, అతడికి పడని రాజకీయ పార్టీలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మోదీని సీఎం కేసీఆర్ నిలదీస్తే ఆయన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమంతో దేశానికే తెలంగాణ రోల్మోడల్గా మారిందన్నా రు. గత ఎన్నికల్లో కొండాను పిండిచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రాబోయే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఇస్తే ప్రమోషన్ వస్తుందన్నారు. మెజార్టీ ఇచ్చిన గ్రామాలు, నాయకులకు పార్టీ గుర్తిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలోనే పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపునకు కృషిచేయాలని కోరారు.
కేసీఆర్ను పదికాలాల పాటు కాపాడుకోవాలి
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను పది కాలాల పాటు కాపాడుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశానికి బీఆర్ఎస్ పార్టీ అవసరమని ప్రజలు కోరుతున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా తీసుకుపోతున్న సీఎం కేసీఆర్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఎదుగుదల చూసి ఓర్వలేకనే దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నాయన్నారు. బీజేపీ ఓ బోగస్ యూనివర్సిటీ వాట్సాప్ గ్రూపును నడుపుతోందని ఆరోపించారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లకు వెళ్లి బండి సంజయ్మీద కేసు పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బండి సంజయ్ కుట్ర చేసిండని, ఆయన సెల్ఫోన్ ఇస్తే బండారం బయట పడుతుందన్నారు.
తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్న బీజేపీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ మత్తడి పడుతోందన్నారు. ఊరూరా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పరకాల నియోజకవర్గానికి 6 గురుకుల పాఠశాల లు, ఒక పాలిటెక్నిక్ కళాశాల వచ్చాయన్నారు. దళితబంధు అందరికీ వస్తుందన్నారు. అభివృద్ధి జరగలాంటే మళ్లీ కేసీఆర్ సర్కార్ రావాలన్నారు. సమ్మేళనంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, గుగులోతు వీరమ్మ, మాజీ ఎంపీపీ దొనికెల మల్లయ్య, నరహరి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.