వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామానికి చెందిన సుమారు 50 మంది బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా పార్టీలో చేరిన బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి సూరారపు నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కాకర్ల ఎల్లయ్య, బీజేపీ నుంచి బుర్ర వెంకన్న, సంజీవ్ గౌడ్, హెచ్ గణేష్, ప్రశాంత్ వీరితో పాటు మరో 50మందికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అందరం కలిసి కట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.