భూపాలపల్లి: సింగరేణి కార్మీకులు స్వీయ రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ ధరించాలని సింగరేణి డీడీఎమ్ఎస్ బానోత్ వెంకన్న కార్మికులకు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6ఇంక్లెన్ గనిని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీడీఎమ్ఎస్ వెంకన్న మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తిలో స్వీయ రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ ధరించాలని అన్నారు. రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించ కుండా కార్మికులకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారం, తాడిచెర్ల బ్లాక్-2, పీవీఎన్ఆర్ ఓసీ బివీ రమణ, ఏఎస్ఓ రవీందర్, గని మేనేజర్ రామ్ భరొస్మహత్, ఎస్ఓ ప్రవీణ్, ఫిట్ ఇంజనీరు శ్రీకాంత్, సినియర్ సర్వే అధికారి రాజేశ్వర్ రావు, పీఓ శ్రావణ్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.