నయీంనగర్, సెప్టెంబర్1: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్ అన్నారు. యూనివర్సిటీలో బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో ఆయన సమీక్షించి, హ్యుమాని టీస్ బిల్డింగ్లోని కొన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం అంతర్గత పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో ముట్టడించారు. విద్యార్థులు భౌతికదూరం పాటించా లని, కొవిడ్ అనుమానితులు ఉంటే వెంటనే అధికారు లకు తెలుపాలని సూచించారు. వెంటనే మెస్ను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా దూ రవిద్య కేంద్ర సంచాలకుల కార్యాలయంలో దూరదర్శ న్ అధికారులు, నిపుణులతో చర్చించారు. అక్కడ ఉన్న ఆడియో, వీడియో స్టూడియోను త్వరలోనే అందుబా టులోకి తెస్తామని కేయూ వైస్ చాన్స్లర్ ఆచార్య తాటి కొండ రమేశ్ తెలిపారు. ఆయనతోపాటు రిజిస్ట్రార్ ఆచార్య బీ వెంకట్రామరెడ్డి, దూర విద్య కేంద్ర సంచా లకులు ఆచార్య టీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైస్ చాన్స్లర్కు సన్మానం
ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కేయూ వీసీ తాటి కొండ రమేశ్ను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సిబ్బంది సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్క రించుకుని ఆయన రేడియో ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఈ నెల 5న ఉదయం 7.35 గంటలకు ప్ర సారం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్ర మంలో స్టేషన్ డైరెక్టర్ మని మంజరి, ప్రోగ్రాం డైరెక్టర్ గోపాల్రావు, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహరా కానేటి, ఏఈ రజినీకాంత్, అనిల్, ప్రసాద్ పాల్గొన్నారు.