ఎనుమాముల మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ. 10,210..
కేసముద్రం ఏఎంసీలో రూ. 10,269
కాశీబుగ్గ/కేసముద్రం, మార్చి 14 : వరంగల్ ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ల లో సోమవారం తెల్లబంగారానికి రికార్డు స్థాయి లో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10,210, 10,269తో వ్యాపారులు కొనుగోలు చేశారు. జ యశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండ లంలోని పరశురాంపల్లి గ్రామానికి చెందిన ము ష్కే రవి 22 బస్తాల పత్తిని వరంగల్ ఎనుమా ముల మార్కెట్కు తీసుకువచ్చాడు. లక్కర్స్ కుమారస్వామి అడ్తి ద్వారా సిరివల్లి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి అత్యధికంగా క్వింటాల్కు రూ.10, 210తో కొనుగోలు చేశారు. మార్కెట్కు సుమారు 4 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు అధికా రులు తెలిపారు. నాణ్యత గల వ్యవసాయ ఉత్ప త్తులు తీసుకువస్తే గిట్టుబాటు ధరలు పొందవ చ్చ ని సూచించారు. కేసముద్రం మార్కెల్కు రైతులు 516 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకు రాగా, నాణ్యత ఆధారంగా క్వింటాల్కు రూ.10269 పలికింది. ఈ ఏడాదికి ఇదే రికార్డు ధర కావడం విశేషం. పత్తికి అధికంగా ధరలు పలుకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలం కలిసి రాక పత్తి దిగుబడి చాలా వరకు తగ్గినందున ధర లు పెరుగడంతో కాస్త ఊరట కలిగిస్తున్నదని వారు అభిప్రాయ పడుతున్నారు.