మహబూబాబాద్, సెప్టెంబర్ 8: ఆరోగ్యకరమైన తెలంగా ణగా తీర్చిదిద్దేందుకు ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయాలు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవ తి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు గుమ్ముడూరు సమీపంలోని రైతువేదికలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ మహిళా, శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. గర్భం దాల్చిన ఆరు నెలల నుంచి ప్రసవించిన మూడు నెలల వరకు మాతా, శిశు సంర క్షణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.2వేల చొప్పున అందిస్తు న్నదన్నారు.
అలాగే ప్రసవానికి ఎలాంటి ఖర్చులు లేకుండా కేసీఆర్ కిట్ ఇస్తున్నదని చెప్పారు. పోషణ అభియాన్లో తెలంగాణ.. దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని పేర్కొన్నా రు. ఈ నెల 3న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి స్త్రీ, శిశు సంక్షేమ పథకం ద్వారా ప్రవేశ పెడుతున్న కార్యక్రమాలను వివరించామన్నారు. 2018లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన కేంద్రం ప్రభుత్వం ప్రస్తుతం ఎత్తివేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమింపజే యాలని కోరినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 24శాతం డెలివరీలు అయ్యేవని, ఇప్పుడవి 65శాతానికి పెరిగాయని వివరించారు. అవగాహన లోపంతో ఆడపిల్లల బరువు దించుకునేందుకు తల్లిదండ్రు లు.. చిన్నవయస్సులోనే వివాహాలు చేస్తున్నారని గుర్తించి వాటిని అరికట్టేందుకు కేసీఆర్ సర్కారు కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అంగన్వాడీలకు ఇచ్చే జీతంలో కేంద్రం కేవలం రూ.2,700 మాత్రమేనని, మిగతావి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
ఈ పథకంలో 40శాతం కేంద్రం, 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చించాల్సి ఉండగా, ఇపుడు 40 శాతాన్ని కేవలం 25 శాతానికి తగ్గించా లని చూస్తున్నదన్నారు. కొవిడ్ సమయంలో సేవలందిస్తూ చనిపోయిన కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వా డీ టీచర్ల కోసం కొట్లాడుతుందని మంత్రి సత్యవతి అన్నా రు. గర్భిణులు పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సూచించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాలే అత్యంత శ్రేష్ఠమన్నారు. స్వచ్ఛమైన తాగునీటితోనే వ్యాధులు దూరమ వుతాయని, అందుకోసమే ప్రభుత్వం మిషన్భగీరథ పథకం ద్వారా మంచినీటిని అందిస్తుందని వివరించారు.పాఠశాలలు, కళాశాలలు తెరిచిన క్రమంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పా టిస్తూ కరోనాను తరిమికొట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాను పోషకలోపం లేని జిల్లాల్లో మొ దటి స్థానంలో నిలుపాలన్నారు. పోషణ అభియాన్లో జూలై 21, 22 తేదీల్లో చేసిన సర్వే ప్రకారం గర్భం దాల్చిన మహి ళల జాబితా తయారు చేశామని, ఈ మేరకు అందరికీ పోషకా హారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతామని తెలి పారు. అనంతరం మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి మహిళా, శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తామని అంగన్ వాడీ టీచర్లతో ప్రతిజ్ఞ చేయించి, పోషణ్ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సర్ణలతాలెనినా, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సుంక రనేని నాగవాణి, సభ్యుడు అశోక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు గద్దె రవి, వార్డు కౌన్సిలర్ సరస్వతి పాల్గొన్నారు.
వీరభద్రుడి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు
కురవి: మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో సత్యవతిరాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మహామండపంలో వేదపండితు లు మహాశీర్వాదం, తీర్థప్రసాదాలు అందజేశారు. సంప్రదా యం ప్రకారం ఈవో పట్టువస్ర్తాలను అందించారు. ఈ సంద ర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరింత శక్తిని ప్రసా దించాలని భగ వంతున్ని వేడుకున్నాని అన్నారు. మంత్రి వర్గంలో అవకాశం కల్పించిన కేసీఆర్కు పాదాభివందనాలు తెలియజేశారు.
సీఎం ముందు చూపుతో మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైం దని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్నివిధాలా అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. త్వరలోనే ప్రజలకు సొంత స్థలాల్లో డబుల్బెడ్రూం ఇండ్ల శుభవార్త తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ నూకల వేణుగో పాల్రెడ్డి, ఎంపీటీసీ నరేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నూక ల శ్రీరంగారెడ్డి, శ్రీధర్రెడ్డి, సర్పంచ్లు నూతక్కి పద్మా నర్సింహారావు, బోడ శ్రీను, గుగులోత్ పద్మా నెహ్రూ, మన్యు ప్యాట్నీ, బాదె నాగయ్య, అల్లూరి కిషోర్వర్మ, వెంకట్రెడ్డి, అర్జున్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.