జయశంకర్ భూపాలపల్లి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో మహాత్మ జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవాలు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, జడ్పీ సీఈవో శోభారాణి , జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి బుర్ర సునిత తదితరులు పాల్గొన్నారు.