జయశంకర్ భూపాలపల్లి : నాటి సమైఖ్య పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, రుణాల కోసం
క్యూలైన్లలో చెప్పులు పెట్టి చకోర పక్షిలా ఎదురు చూడాల్సి వచ్చేది. నేడు సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఇండ్ల వద్దకే సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు.
చిట్యాల మండల కేంద్రంలో రూ.25 లక్షల సీసీ రోడ్లు, రైతు వేదికను ప్రారంభించారు. 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు పోలీస్ స్టేష్టషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో చెప్పులు పెట్టి నిరీక్షించే పరిస్థితి ఉండేదన్నారు.
ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సమస్యలు లేకుండా ఏడాదికి ఎకరానికి రూ.10 రైతుబంధు సాయంగా అందజేస్తున్నారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. బీజేపీ బూటకపు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసి రైతులు లబ్ధి పొందాలన్నారు.
వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పూర్ణచందర్రావు, ఎంపీటీసీలు కట్కూరి పద్మ, అనిల్, తదితరులు పాల్గొన్నారు.