భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లి ఏరియాలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ ఆయా గనులు, డిపార్ట్మెంట్ల అధికారులకు మెమోరండం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఉదృతం చేస్తామని టీబీజీకేఎస్ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్, బ్రాంచి, ఫిట్, మైన్స్, సేఫ్టీ కమిటీ నాయకులు ఎబూసి ఆగయ్య, బడితల సమ్మయ్య, రత్నం సమ్మిరెడ్డి, రఘోత్తంరెడ్డి, జగత్రావు, ఆర్. కనకయ్య, మండ సంపత్, దేవరకొండ మధు,ప్రభాకర్, కొచ్చర్ల రవికుమార్, గాజే సాంబయ్య, రాంచందర్, బాసనపల్లి కుమారస్వామి, ప్రేమ్సింగ్, మురళీకృష్ణ తదితర నాయకులతో పాటు శ్రేణులు, కార్మికులు పాల్గొన్నారు.