జయశంకర్ భూపాలపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పెంట మల్లికార్జున్ అనే వ్యక్తి ఊరు పక్కన గల పంట పొలాలకు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికిచేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.