జయశంకర్ భూపాలపల్లి : ఎనిమదో విడత రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో జిల్లా రైతాంగం సంతోషంలో మునిగిపోయారు. పంట పెట్టుబడికి సాయం అందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన బాంధవుడని అన్నారు. రైతులు పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడొద్దనే రైతు బంధు సాయం అందజేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపని ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.