జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో వైద్య కళాశాల నిర్మించడానికి రూ.168 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు ఖడ్గం జనార్దన్ పటేల్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.