జయశంకర్ భూపాలపల్లి : రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ ఫామ్ పంట ద్వారా అధిక లాభాలను పొందవచ్చని తెలిపారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కాశింపల్లి గ్రామంలో ఆదివారం ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ సంవత్సరం భూపాలపల్లి జిల్లాలో దాదాపు 45 వేల ఎకరాలలో ఈ పంటను వేయనున్నట్లు వివరాలను వెల్లడించారు. సంవత్సరానికి ఎకరాకు లక్ష రూపాయల నికర లాభం వస్తుందన్నారు.
అంతర్గత పంటలు కూడా వేసుకుని అదనపు లాభాలను కూడా పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు. రైతులు సాంప్రదాయ పంటలకే కాకుండా నూతన సాగు విధానంపై దృష్టి సారించాలన్నారు.