చిట్యాల: మండలంలోని పాశిగడ్డతండాలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు అనాథపిల్లలకు ఆర్థికసాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాలికె రఘుపతి, వ్యవసాయ విస్తరణాధికారి రమణ్కుమార్ బుధవారం బాధిత చిన్నారులకు అందించారు. అంతేకాకుండా జూకల్ కు చెందిన సాయిరెడ్డి 50కిలోల బియ్యాన్ని అందజేశారు.