జయశంకర్ భూపాలపల్లి : అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై అస్సాం సీఎం అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు.
గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్సాం మంత్రిగా పనిచేసిన కాలంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం అనుభవించాల్సిన శర్మ ఈరోజు తెలంగాణకు నేడు వచ్చి వరంగల్ వచ్చి నీతిమంతుని మాదిరిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన అవినీతి బాగోతం దేశ ప్రజలకు తెలుసన్నారు.
దేశంలో నీతివంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.